హథీరాంజీ బాబా మఠం భూములు కాపాడాలి
తిరుమల (CLiC2NEWS): ఈ రోజు (ఆదివారం) తిరుమల శ్రీవారిని తెలలంగాణకు చెందిన పలువురు నాయకులు దర్శించుకున్నారు. వారిలో తెలంగాణ డిప్యూటీ స్పీకర్ జాతోట్ రామచందర్ నాయక్, ఎంపీలు ఈటల రాజేందర్, బలరాం నాయక్ తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఎంపి , బిజెపి సీనియర్ నాయకులు ఈట రాజేందర్ మాట్లాడుతూ.. హథీరాంజీ మఠం బాధ్యతలను బంజారాలకు అప్పంగిచాలని కోరారు. హథీరంజీ మఠం కూల్చివేయకుండా కొనసాగించాలని, దానికి సంబంధించిన భూములను కాపాడాలని కోరారు.
మరో ఎంపి బలరామ్ నాయక్ మాట్లాడుతూ.. మఠం బాధ్యతలను బంజారాలకు అప్పంగిచాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: Jubilee Hills by-election: నామినేషన్ వేసిన విష్ణువర్ధన్రెడ్డి