నా ద‌గ్గ‌ర అంత డ‌బ్బు లేదు, అందుకే పోటీ చేయ‌డంలేదు.. నిర్మాలా సీతారామ‌న్‌

ఢిల్లీ (CLiC2NEWS): ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు అవ‌స‌ర‌మైన నిధులు త‌న వ‌ద్ద లేవ‌ని, అందుకే పోటీ చేయ‌డంలేద‌ని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మ‌లా సీతార‌మాన్ పేర్కొన్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు బిజెపి అధ్య‌క్షుడు జెపి న‌డ్డా అవ‌కాశం క‌ల్పించార‌న్నారు. ఎపి లేదా త‌మిళ‌నాడు నుండి పోటీ చేసే అవ‌కాశం ఇచ్చారు. ఒక వారం ఆలోచించిన త‌ర్వాత కుద‌ర‌క‌పోవ‌చ్చు అని చెప్పారు. ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు త‌న వ‌ద్ద అంత డబ్బు లేద‌న్నారు. ఎపి లేదా త‌మిళ‌నాడులో నాకు ఒక స‌మ‌స్య ఉంద‌న్నారు. అక్కడ గెలుపున‌కు కులం, మతం వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటార‌ని, అవ‌న్నీ చేయ‌లేన‌ని.. అందుకే పోటీ చేయ‌న‌ని తెలిపారు.

దేశ ఆర్ధిక మంత్రిగా ఉన్న వ్య‌క్తి వ‌ద్ద ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు అవ‌స‌ర‌మైన నిధులు లేవా.. అని అడిగిన ప్ర‌శ్న‌ల‌కు నిర్మలా సీతారామ‌న్ స‌మాధానం తెలిపారు. నాజీతం, నాసంప‌ద‌, నాపొదుపు మాత్ర‌మే నావి. క‌న్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మాత్రం నాది కాదు క‌దా అని అన్నారు. ఓ జాతీయ వార్తా ఛాన‌ల్ నిర్వ‌హించిన స‌దస్సులో ఆమె మాట్లాడారు. పార్టికి చెందిన ఇత‌ర అభ్య‌ర్థుల కోసం ఎన్నిక‌ల్లో తాను ప్ర‌చారం చేస్తాన‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.