ఐపిఎల్ చరిత్ర‌లో కొత్త రికార్డు సృష్టించిన హైద‌రాబాద్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌రుగుతున్న టోర్నీలో హైద‌రాబాద్ అత్య‌ధికంగా 277 ప‌రుగులు చేసింది. ఉప్ప‌ల్‌లో హైద‌రాబాద్ జ‌ట్టు ముంబ‌యి జ‌ట్టుతో త‌ల‌ప‌డుతోంది. రోహిత్ సేన టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైద‌రాబాద్ జ‌ట్టు ఐపిఎల్ టోర్ని చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక స్కోర్ న‌మోదు చేసింది. 3 వికెట్ల న‌ష్టానికి 277 ప‌రుగులు చేసింది.  ట్రావిస్ హెడ్ 62, అభిషేక్ శ‌ర్మ 63, మార్‌క్ర‌మ్ 42, క్లాసెస్ 80 ప‌రుగుల‌తో రాణించారు. 278 ప‌రుగుల ల‌క్ష్యంతో రోహిత్ సేన బ‌రిలోకి దిగింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఐపిఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక స్కోర్‌  2013లో పుణెపై బెంగ‌ళూరు (263) న‌మోదు చేసింది.

Leave A Reply

Your email address will not be published.