కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం..

ఢిల్లీ (CLiC2NEWS): కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామ చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి బిజెపిలో చేర‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆగ‌స్టు 21వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా స‌మ‌క్షంలో బిజెపిలో చేర‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు వీలైనంత త్వ‌ర‌లో వెల్ల‌డిస్తాన‌ని అన్నారు. స్పీక‌ర్ ఫార్మాట్లో ఇచ్చిన రాజీనామాను ఈనెల 8వ తేదీన స‌భాప‌తిని క‌లిసి అమోదింప‌జేసుకుంటానని పేర్కొన్నారు. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ కాంగ్ర‌స్‌కు, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిన‌దే ఢిల్లీలోని బిజెపి నేత వివేక్‌తో పాటు రాజ‌గోపాల్ రెడ్డి అమిత్‌షాను కలిశారు. అనంత‌రం మీడియాకు వివ‌రించారు. మునుగోడు ఉప ఎన్నిక రాజ‌గోపాల్‌రెడ్డి కోసం కాద‌ని, తెలంగాణ రాజ‌కీయాల్లో పెనుమార్పు తీసుకొస్తుంద‌ని పేర్కొన్నారు. రాష్ట్ర భ‌విష్య‌త్తుకు ప‌నికొచ్చే విధంగా మునుగోడు ప్ర‌జ‌లు తీర్పు ఇవ్వ‌నున్నార‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.