అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం.. 800 మందికి పైగా మృతి
కాబూల్ (CLiC2NEWS): అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి 800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఆదివారం అర్ధరాత్రి భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. పాకిస్థాన్ సరిహద్దుల్లోని కునార్ ప్రావిన్స్లో భూకంప తీవ్రత నమోదైంది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.0గా నమోదైంది. నంగార్హార్లోని జలాలాబాద్ సమీపంలో 8 కిలోల మీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్లోని కునార్, నోరిస్తాన్, నంగర్హార్ ప్రావిన్స్లు భూకంపం కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. ఇళ్లు కూలిపోయి ప్రజలు నిరాశ్రయులయ్యారు. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 2500 మందికి వరకు గాయపడినట్లు సమాచారం.

[…] […]