Telangana: రేపు రాష్ట్ర కేబినేట్ సమావేశం
హైదరాబాద్ (CLiC2NEWS) : రేపు మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ అత్యవసర సమావేశం జరగనుంది. రాష్ట్రంలో లాక్డౌన్ ఈ నెల 19 తో ముగియనున్న నేపథ్యంలో లాక్డౌన్ పొడిగింపు, సీజనల్ వ్యాధులు, తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. వర్షపాతం, వానాకాలం సాగు, సాగు సంబంధిత అంశాలు, గోదావరిలో నీటి ఎత్తిపోత, జల విద్యుత్ ఉత్పత్తిపై కూడా చర్చించనున్నారు.
సీఎం శ్రీ కేసీఆర్ అధ్యక్షతన, శనివారం (రేపు) మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ అత్యవసర భేటీ కానున్నది. ఈ సందర్భంగా రాష్ట్రంలో లాక్ డౌన్, వర్షపాతం, వానాకాలం సాగు, వ్యవసాయం సంబంధిత సీజనల్ అంశాలు, గోదావరిలో నీటిని లిఫ్టు చేసే అంశం, హైడల్ పవర్ ఉత్పత్తి తదితర అంశాలపై చర్చించనున్నది.
— Telangana CMO (@TelanganaCMO) June 18, 2021