31ఆశా వర్కర్ పోస్టులకు రేపే లాస్ట్ డేట్
నంద్యాల జిల్లాలో 31 ఆశా వర్కర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం రేపటితో ముగియనుంది. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ నంద్యాల జిల్లాలో ఆశా వర్కర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులై 25 ఏళ్లు దాటిన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 45 ఏళ్ల లోపు ఉండాలి. నెలకు వేతనం రూ.10వేలు. దరఖాస్తులను ఆప్లైన్లో రేపటిలోపు పంపించాలి. పదో తరగతిలో సాధించిన మార్కులు ఆధారంగా ఎంపిక జరుగుతుంది.