ఆధార్-పాన్ లింక్ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: పాన్ కార్డు- ఆధార్ లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చాలాకాలంగా చెబుతోంది. పాన్- ఆధార్ నెంబర్లను లింక్ చేయడానికి నేడు (31-3-2021) చివరి తేదీ గా ఉంది. తర్వాత లింక్ చేసినట్లయితే రూ. 1000 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించింది. తాజాగా ఈ గడువును మరోసారి పెంచింది. జూన్ 30 వరకు అనుసంధానం చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది.