నటుడు కైకాల సత్యనారాయణను పరామర్శించిన మెగాస్టార్
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రముఖ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణను మెగస్టార్ చిరంజీవి పరామర్శించారు. కైకాల సత్యనారాయణ శనివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసినదే. ఆయన స్పృహలోకి రాగానే వైద్యుల సాయంతో ఫోన్లో పరామర్శించానని చిరంజీవి తెలిపారు. ట్రాకియాస్టోమి కారణంగా ఆయన మాట్లాడలేకపోయారని, చికిత్స అందిస్తున్న వైద్యుల సాయంతో పలకరించానన్నారు. కైకాల పూర్తిగా కోలుకుంటారని తనకు నమ్మకం ఉందని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్ధిస్తున్నానని ట్వీట్ చేశారు.