పార్టీ కోసం జ‌న‌సేనాని రూ. 10 కోట్ల విరాళం

అమ‌రావ‌తి (CLiC2NEWS): జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ పార్టీ కోసం రూ. 10 కోట్ల విరాళం ఇచ్చారు. స్వ‌తంత్ర సంగ్రామాన్ని ముందుకు న‌డిపించ‌డానిక మోతీలాల్ నెహ్రూ వంటి గొప్ప నాయ‌కులు త‌మ స్వార్జితాన్ని విరాళంగా ఇచ్చార‌న్నారు. రాష్ట్ర భ‌విష్‌య‌త్తును తీర్చిదిద్ద‌డ‌మే ల‌క్ష్యంగా సాగిస్తున్న రాజ‌కీయ ప్ర‌యాణానికి త‌న వంతుగా ఎన్నిక‌ల ప్ర‌చార ఖర్చుల నిమిత్తం అంద‌జేస్తున్న‌ట్లు తెలిపారు.

జ‌న‌సేన పార్టీ కోసం ఓ బెల్దారి మేస్త్రి రూ. ల‌క్ష విరాళం అందించారు. ఇలా ఎంద‌రో కూలీలు కూడా రూ. 100, రూ. 200 చొప్పున విరాళాలు ఇచ్చార‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ తెలిపారు. అలాంటి వారి స్ఫూర్తితో సినిమాల ద్వారా వ‌చ్చిన నా క‌ష్టార్జితాన్ని, ప్ర‌భుత్వానికి ప‌న్నులు చెల్లించిన త‌ర్వాత మిగిలిన డ‌బ్బును పార్టికి విరాళంగా ఇస్తున్న‌ట్లు తెలిపారు. ఎన్నిల స‌మ‌యంలో ఈ మొత్తం పార్టీకి ఎంతో ఉపయోగ‌ప‌డుతుంద‌ని భావిస్తున్నాన‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ పేర్కొన్నారు. న‌గ‌దుకు సంబంధించిన చెక్కును పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. నాగ‌బాబా స‌మ‌క్షంలో కోశాధికారి ఎవి ర‌త్నంకి అంద‌జేశారు.

 

Leave A Reply

Your email address will not be published.