కోడూరులో నీట మునిగిన పొలాలను పరిశీలించిన పవన్
కోడూరు (CLiC2NEWS): మొంథా తుఫాన్ ముంపునకు గురైన పంట పొలాలను ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు.
గురువారం కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు మండలం కృష్ణాపురం గ్రామంలో పవన్ పర్యటించారు. ఈ సందర్భంగా మోకాలి లోతు వరద ముంపునకు గురైన పొలాల్లోకి దిగి పంట చేలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అన్ని రకాలుగా ప్రభుత్వం ఆందుకుంటుందని వారికి భరోసాను ఇచ్చారు.
మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు పర్యటిస్తున్నారు. అవనిగడ్డ నియోయకవర్గం కోడూరు దగ్గర తుపాను మూలంగా దెబ్బ తిన్న పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి ఆవేదన తెలుసుకొని ధైర్యం చెప్పారు. @APDeputyCMO @ncbn pic.twitter.com/SODBd79pys
— JanaSena Party (@JanaSenaParty) October 30, 2025







[…] […]