చుక్కల పార్థసారథికి సిఎం జ‌గ‌న్‌ అభినంద‌న‌

నెల్లూరు (CLiC2NEWS): ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ జాతీయ సేవాప‌థ‌కం అవార్డు గ్ర‌హీత పార్థ‌సార‌థిని అభినందించారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఎన్‌ఎస్ఎస్ వాలంటీర్ చుక్కల పార్థసారథి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఎన్ ఎస్ ఎస్ సెల్ ద్వారా తాను చేపట్టిన బ్లడ్ డొనేషన్, మొక్కల పెంపకం, గ్రామాలు దత్తతు, డ్రగ్ డిఎడిషన్, ఎయిడ్స్ వ్యాధి, దిశా యాప్ పై చేపట్టిన అవగాహన కార్యక్రమాల గురించి సిఎంకు వివరించారు.

విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జి.యం సుందరవల్లి, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ ఉదయ్ శంకర్ అల్లం ప్రోత్సాహాన్నిఅందించార‌ని తెలిపారు.ఇదే విధంగా రాబోయే రోజుల్లో ఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా విశ్వవిద్యాలయనికి, రాష్ట్రానికి మరింత ఖ్యాతి వచ్చేలా కృషిచేయాల‌ని సిఎం అన్నారు.

Leave A Reply

Your email address will not be published.